Advertisement

సిబిఐ చేతికి హత్రాస్ హత్యాచారం కేసు

By: Sankar Sun, 04 Oct 2020 06:46 AM

సిబిఐ చేతికి హత్రాస్ హత్యాచారం కేసు

యూపీలో హత్రాస్ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. హత్రాస్ లో అక్టోబర్ 31 వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నప్పటికీ, రాజకీయ నాయకులు హత్రాస్ లోని బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పోటీపడి వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తకరమైన పరిస్థితులకు దారితీస్తోంది.

పార్టీ నాయకులతో పాటుగా కార్యకర్తలు, ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లమీదకు రావడంతో పోలీసుల కంటే కరోనా ఎటువైపు నుంచి వచ్చి ఎలా ఎటాక్ చేస్తుందో అని అధికారులు భయపడుతున్నారు. హత్రాస్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, కేసును సీబీఐకి అప్పగించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు కలిసి మాట్లాడిన తరువాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఈ కేసులో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అత్యాచారానికి గురై మరణించిన బాధితురాలి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించకుండా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ కేసు దేశంలో సంచలనంగా మారింది. బాధితురాలి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించకుండా అంత్యక్రియలు చేయడం వెనుక కారణాలు ఏంటి అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురుకావడంతో యోగిసర్కార్ ఈ కేసును సీరియస్ గా తీసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

Tags :
|
|
|

Advertisement