Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్

By: Sankar Fri, 11 Dec 2020 5:02 PM

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్


కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు అన్ని కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి ..ఇప్పటికే బ్రిటన్ లో కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది...ఇక కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపిన దేశాలలో ముందు వరుసలో ఉన్న భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు...

అయితే మరో నెలరోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో కరోనా మరణాల రేటు 8 శాతంగా ఉండగా రాష్ట్రంలో 1.04 శాతం మాత్రమేనని తెలిపారు..

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని, దీనిపై పరిశోధన పత్రం సిద్ధం చేయనుందని తెలిపారు. సమష్టి కృషి ఎల్లప్పుడూ గొప్ప ఫలితాలను ఇస్తుందని వైద్యులను, సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.

Tags :
|

Advertisement