Advertisement

  • మహిళ పై గ్యాంగ్ రేప్...సంచలన విషయాలు వెలుగులోకి...!

మహిళ పై గ్యాంగ్ రేప్...సంచలన విషయాలు వెలుగులోకి...!

By: Anji Fri, 06 Nov 2020 5:28 PM

మహిళ పై గ్యాంగ్ రేప్...సంచలన విషయాలు వెలుగులోకి...!

సైబరాబాద్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మహిళను తెలిసిన వ్యక్తే నమ్మించి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు తేల్చారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు.

మధు అనే వ్యక్తి ప్లాన్ ప్రకారం ఆమెను చందానగర్‌లో కారులో ఎక్కించుకున్నాడు. అతనితో మరో ఇద్దరు నందు యాదవ్, కుటుంబ రెడ్డిలు జతకలిశారు.

అక్కడి నుంచి ఆమెను కొల్లూరు సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలసి మద్యం తాగారు. మహిళతో కూడా బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఒకరి తర్వాత మరొకరు దారుణంగా రేప్ చేశారు.

అత్యాచారం సమయంలో ఆమె తలకు గాయమైంది. అనంతరం ఆమెను కిరాతకంగా చంపేశారు. ముగ్గురూ ప్లాన్ ప్రకారమే ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.


ఆమె కనిపించకుండా పోయిన సమయంలో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకి.. కొల్లూరు సమీపంలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం అందించారు.

అనంతరం సామూహిక అత్యాచారం, హత్య చేసినట్లు తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. మధునాయక్‌తో పరిచయం ఉండడం వల్లే ఆమె అతనితో వెళ్లినట్లు సమాచారం.

Tags :

Advertisement