Advertisement

  • యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

By: chandrasekar Sat, 21 Nov 2020 5:39 PM

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో అమ్మవారికి ఊంజల్‌ సేవ


శుక్రవారం సాయంత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో ఊంజల్‌ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో ఆలంకారం చేసారు.

శ్రీవారికి బాలాలయం ముఖమండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్‌ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన నిర్వహించారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు.

మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణ జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉప ప్రధానార్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించారు. మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు.

తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది.

Tags :

Advertisement