Advertisement

  • ఆర్సీబితో మ్యాచ్ కు ముందు కింగ్స్ ఎలెవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

ఆర్సీబితో మ్యాచ్ కు ముందు కింగ్స్ ఎలెవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

By: Sankar Thu, 15 Oct 2020 4:08 PM

ఆర్సీబితో మ్యాచ్ కు ముందు కింగ్స్ ఎలెవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. అదేంటంటే ఫుడ్ పాయిజన్ నుండి ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కోలుకున్నాడు. దాంతో అతను ఈ రోజు బెంగుళూర్ తో జరిగిగే మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ఏడాది ప్రారంభానికి ముందే గేల్ అనారోగ్యం బారిన పడటంతో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా గేల్ పాల్గొనలేదు. కానీ ఈ రోజు పంజాబ్ ఆర్సీబీ ని ఎదుర్కోనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు నెట్స్ లో గేల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జట్టు యాజమాన్యం. ఈ యూనివర్స్ బాస్ ఐపీఎల్ లోనే మోస్ట్ డేంజరస్ బాట్స్మెన్ అనే విషయం అందరికి తెలిసిందే.

అయితే ఐపీఎల్ లో మోస్ట్ సిక్స్ లు కొట్టిన ఆటగాడైన గేల్ ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు. దాంతో అతను ఈ రోజు మ్యాచ్ లో ఆడటం దాదాపు ఖాయమైంది. చూడాలి మరి ఆ మ్యాచ్ లో గేల్ ఎలా రాణిస్తాడు అనేది. ఇక ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లలో ఒక్కటే గెలిచిన పంజాబ్ పాయింట్ల పట్టికలో చివర్లో ఉంది.


Tags :
|

Advertisement