Advertisement

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కరోనాతో మృతి

By: chandrasekar Thu, 24 Sept 2020 12:50 PM

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కరోనాతో మృతి


కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి (65) కన్ను మూసారు. కరోనావైరస్ సోకడంతో చికిత్స కోసం వారం రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.

కర్ణాటకలోని బెలగావి జిల్లా బెల్గాం తాలుకాలోని కేకే కొప్పాలో సోమవ్వ, చనబసప్ప దంపతులకు జన్మించిన సురేష్ అంగడి. రాజకీయాల్లో అంచలంచలుగా ఎదగుతూ వచ్చారు.

ప్రస్తుతం బెలగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ అంగడి 2004 నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు.

Tags :
|

Advertisement