Advertisement

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

By: chandrasekar Fri, 09 Oct 2020 12:31 PM

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత


కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ (74) కన్నుమూశారు. పాశ్వాన్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు ట్విటర్ ద్వారా తెలిపారు.

‘పాపా ప్రస్తుతం మీరు ఈ ప్రపంచంలో లేరు. కానీ, మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా నాతోనే ఉంటారు’ అంటూ చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. మిస్ యూ పాపా అంటూ చిన్నతనంలో తనను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు.

జననేతగా గుర్తింపు పొందిన పాశ్వాన్ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Tags :
|

Advertisement