తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
By: Sankar Mon, 07 Dec 2020 5:25 PM
రైతులు స్వేచ్ఛగా తమ పంటలను లాభసాటి ధరకు అమ్ముకునేలా తమ ప్రభుత్వం చట్టం తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రైతుల పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలు తొలగించిందన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు చట్టాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, రైతులకు నష్టం కలిగించే చర్యలను కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు..
నిరసనలతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. సన్న బియ్యం వేయమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పడు చేతులెత్తేసిందని మండిపడ్డారు.