Advertisement

  • గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్ కారణమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్ కారణమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By: chandrasekar Wed, 02 Dec 2020 09:27 AM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్ కారణమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణం అధికార టీఆర్ఎస్ పార్టీనే అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. అంతేకాదు దీనికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని కూడా ఆయన విమర్శించారు.

టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందన్నారు.

ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ పోలింగ్‌ సరళి చూశాక గెలుస్తామనే విశ్వాసం తమకు కలిగిందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల కోసం నాయకులు భారీగానే ప్రచారం చేపట్టారు. కానీ పోలింగ్ శాతం మాత్రం తక్కువగా నమోదైంది.

Tags :

Advertisement