Advertisement

  • తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

By: Sankar Mon, 07 Dec 2020 08:44 AM

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా


దుబ్బాక ఉప ఎన్నికల్లో విక్టరీ కొట్టిన భారతీయ జనతా పార్టీ.. ఆ వెంటనే గ్రేటర్‌ ఎన్నికల సమరంలోకి దూకి సత్తా చాటింది... అనూహ్యంగా పుంజుకుని.. అధికార పార్టీకి ధీటుగా నిలిచింది.. ఇక, ఈ విజయాలపై రాష్ట్ర నేతలను అభినందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా... ఇవాళ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ విజయశాంతి, వివేక్ తదితరులు.. అమిత్‌షాను కలిశారు...

జీహెచ్‌ఎంసీ ఫలితాల పట్ల తెలంగాణ బీజేపీ నేతలను అమిత్ షా అభినందించారు అని తెలిపారు బండి సంజయ్... ఇదే దూకుడును కొనసాగించమని అమిత్ షా సూచించారన్న ఆయన.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ఇదే సామర్థ్యాన్ని కనబర్చాలని షా సూచించారని వెల్లడించారు.. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్.. తెలంగాణ అసలైన ఉద్యమకారులను టీఆర్ఎస్ విస్మరిస్తోందని విమర్శించారు..

అందుకే ఉద్యమకారులు బీజేపీలో చేరుతున్నారని.. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మరోవైపు.. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు బండి... విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు వచ్చారు... చాలా సంతోషంగా ఉందన్న ఆయన.. మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉంచే వారందరినీ స్వాగతిస్తాం.. కానీ, “ఆకర్ష్ ఆపరేషన్” చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. టీఆరెస్‌ ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయేనని ప్రకటించారు బండి సంజయ్.

Tags :

Advertisement