Advertisement

  • బ్రేకింగ్ న్యూస్ : మళ్ళీ ఆసుపత్రి లో జాయిన్ అయిన అమిత్ షా

బ్రేకింగ్ న్యూస్ : మళ్ళీ ఆసుపత్రి లో జాయిన్ అయిన అమిత్ షా

By: Sankar Tue, 18 Aug 2020 11:12 AM

బ్రేకింగ్ న్యూస్ : మళ్ళీ ఆసుపత్రి లో జాయిన్ అయిన అమిత్ షా


కరోనావైరస్‌ నుంచి కోలుకొని ఇటీవల ఇంటికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీలోని ఏయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఏయిమ్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

కాగా అమిత్ షాకు ఇటీవలే కరోనా సోకింది.. ఆగస్టు 2న పాజిటివ్ తేలింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన గురుగ్రామ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్టు ఈనెల 14న అమిత్ షా ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

ఇప్పుడు శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అవుతారంటున్నారు.

Tags :
|
|

Advertisement