కరోనా పై పోరాటం ఇంకా పూర్తికాలేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్
By: chandrasekar Wed, 16 Sept 2020 10:20 AM
దేశంలో విజృంభిస్తున్న
కరోనా పై పోరాటం ఇంకా పూర్తికాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్
చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థను కరోనా అతలా కుతలం చేసింది. భారత్లో కరోనా వైరస్
వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఆయన
తెలిపారు. కరోనా మహమ్మారిపై మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశంలో నమోదవుతున్న
మొత్తం కేసులలో మృతుల రేటు 1.67 శాతంగా, కోలుకుంటున్న వారి రేటు 77.65
శాతంగా ఉందని హర్షవర్దన్ చెప్పారు.
భారత్ లో నమోదవుతున్న
కరోనా కేసుల సంఖ్యను ప్రతి మిలియన్కు 3,320కి మరియు మరణాలను ప్రతి మిలియన్కు 55కు
పరిమితం చేయగలిగామని మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే
కేసులు, మరణాల
రేటు భారత్లోనే కనిష్టంగా ఉన్నదని ఆయన చెప్పారు. కాగా, సోమవారం
కొత్తగా 83,809 కరోనా కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల
సంఖ్య 49
లక్షలు దాటింది. కొత్తగా నమోదైన 1,054 మరణాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 80,776కు చేరింది. అందరూ మాస్కులు ధరించి సామజిక దూరం పాటించితే కరోనా వ్యాప్తికి
అడ్డుకట్ట వేయవచ్చు.