Advertisement

  • ఆ పండుగ నాటికి దేశంలో కరోనా మీద నియంత్రణ సాదిస్తాము ..కేంద్ర ఆరోగ్య మంత్రి ఆశాభావం

ఆ పండుగ నాటికి దేశంలో కరోనా మీద నియంత్రణ సాదిస్తాము ..కేంద్ర ఆరోగ్య మంత్రి ఆశాభావం

By: Sankar Mon, 31 Aug 2020 06:44 AM

ఆ పండుగ నాటికి దేశంలో కరోనా మీద నియంత్రణ సాదిస్తాము ..కేంద్ర ఆరోగ్య మంత్రి ఆశాభావం


దీపావళి నాటికి కోవిడ్-19పై నియంత్రణ సాధిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన అనంతకుమార్‌ ట్రస్ట్‌ ఆదివారంం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వెబినార్ ద్వారా పాల్గొన్నారు.

కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా నియంత్రించేందుకు నాయకులు, సాధారణ ప్రజలు ఎవరికివారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో కరోనా మొదలైన తొలినాళ్లలో టెస్టింగ్ కిట్లు, మాస్కులు, పీపీఈ కిట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం సరిపడేన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలో కరోనా వైరస్ తొలి కేసు నమోదుకు ముందే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహమ్మారిని ఎదుర్కొవడంపై చర్చించారన్నారు. అనంతరం తన అధ్యక్షతన ఓ కమిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేశారని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కమిటీ 22 సార్లు సమావేశమయ్యిందని పేర్కొన్నారు.

దేశంలో ఫిబ్రవరికి ఒక్క ల్యాబొరేటరీ ఉండేదని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,583 ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఇందులో 1,000కిపైగా ప్రభుత్వ ల్యాబొరేటరీలేనని అన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు పది లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అలాగే దేశంలో ఎన్95 మాస్క్‌లను పది సంస్థలు ఉత్పత్తి చేస్తుండగా.. వెంటిలేటర్లను 25 కంపెనీలు తయారుచేస్తున్నాయని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఎందుకంటే ప్రధాని దూరదృష్టి వల్లే ఇది సాధ్యమవుతోందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement