- హోమ్›
- వార్తలు›
- అయోధ్య పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టిన పూజారికి గుర్తుతెలియని వ్యక్తుల బెదింపులు
అయోధ్య పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టిన పూజారికి గుర్తుతెలియని వ్యక్తుల బెదింపులు
By: chandrasekar Wed, 05 Aug 2020 8:50 PM
అయోధ్యలో రామాలయ
నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్న సందర్బంగా పూజా కార్యక్రమానికి
ముహూర్తంపెట్టిన పూజారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదింపులు వస్తున్నాయి.
కర్ణాటకకు చెందిన
పండితుడు ఎన్ఆర్ విజయేంద్ర శర్మ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు
స్వామి గోవింద్ దేవ్ గిరిజికి సన్నిహతులు. ఆయన కోరిక మేరకు ఏప్రిల్లో అక్షయ
తృతీయ నాడు ముహూర్తం పెట్టారు. అయితే, లాక్డౌన్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
దీంతో ఆగస్టు 5వ
తేదీన భూమిపూజకు ముహూర్తంగా ఖరారు చేశారు. ముహూర్తం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు
పూజ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, విజయేంద్రకు ఫోన్లో బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
విజయేంద్ర శర్మ రామాలయ
భూమిపూజకు ముహూర్తం తేదీని ఎందుకు నిర్ణయించావని గుర్తు తెలియని వ్యక్తి తనను
చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించారని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని
బెళగావి పూజారి నివాసం వద్ద పోలీసులు భద్రత కల్పించారు.