Advertisement

  • గల్వాన్‌ ఘర్షణలో చైనాకు కోలుకోని ఎదురుదెబ్బ...చైనా దేశ 60 మంది జవాన్లు మృతి

గల్వాన్‌ ఘర్షణలో చైనాకు కోలుకోని ఎదురుదెబ్బ...చైనా దేశ 60 మంది జవాన్లు మృతి

By: chandrasekar Mon, 14 Sept 2020 4:52 PM

గల్వాన్‌ ఘర్షణలో చైనాకు కోలుకోని ఎదురుదెబ్బ...చైనా దేశ 60 మంది జవాన్లు మృతి


జూన్ 15న రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా వైపున 60 మంది జవాన్లు మరణించారని అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్‌ వీక్‌ సంచలన కథనం ప్రచురించింది. చైనా దీన్ని అవమానంగా భావిస్తోందని తెలిపింది. పీఎల్‌ఏకు ఈ స్థాయిలో దెబ్బతగులుతుందని చైనా ఏనాడూ భావించలేదని దూకుడుగా వ్యవహరించే జిన్‌పింగ్‌కు ఇది పెద్ద అపజయంగా భావించాలని ఆ కథనంలో రాసారు. గల్వాన్‌లో ఘోర పరాజయం అనంతరం చైనా అధ్యక్షుడు, పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్, పీఎల్‌ఏ నాయకుడు కూడా అయిన జిన్‌పింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు న్యూస్ వీక్ కథనంలో తెలిపారు. భారత్‌పై ప్రతీకారం తీసుకోవాలని సైన్యాన్ని ఆయన ప్రోత్సహించారట. దీంతో పాటు మిలిటరీకి చెందిన ప్రత్యేక దళాన్ని సరిహద్దులో మోహరించాలని ఆదేశించారట.

‘భారత సరిహద్దులో చైనా సైన్యం వైఫల్యం తర్వాత సైన్యంలో విధేయులను నియమించుకోవాలని చైనా సైన్యం జిన్‌పింగ్‌కు సూచించింది. అతి పెద్ద విషయం ఏమిటంటే భారత సైనికులపై వీలైనంత త్వరగా మరో దూకుడు చర్య తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు.’ అని ఆ వార్తా కథనంలో రాశారు. ఇక తమ వైపు ఎంత మంది జవాన్లు చనిపోయారనేది వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం డ్రాగన్ చేసిన మరో తప్పిదమని వార్తా కథనంలో పేర్కొన్నారు. గల్వాన్‌ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారని భారత ప్రభుత్వం వెల్లడించింది. చైనా వైపు దాదాపు 60 మంది సైనికులు మరణించారు, మరెందరో గాయపడ్డారని కథనంలో పేర్కొన్నారు.

గల్వాన్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ 40 ఏళ్ల తర్వాత మొదటి ప్రమాదకరమైన ఘర్షణగా న్యూస్ వీక్ కథనం పేర్కొంది. చైనా సరిహద్దులో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా న్యూస్ వీక్ కథనాన్ని బలపరుస్తున్నాయి. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పీఎల్ఏ సైనికులు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత్ జవాన్లు వెనుకడుగు వేయకపోవడంతో కాల్పులకు కూడా దిగారు. 50 ఏళ్లలో తొలిసారి భారత్‌ దూకుడు వైఖరిని ప్రదర్శించిందని న్యూస్ వీక్ కథనం తెలిపింది. ఆగస్టు చివరి వారంలో చైనా స్వాధీనం చేసుకున్న అత్యంత ఎత్తైన ప్రాంతాలను భారత్ తిరిగి తన వశం చేసుకుందని తెలిపారు. ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నాలను భారత జవాన్లు అడ్డుకోవడంతో చైనా సైన్యం షాక్‌కు గురైందని రాసుకొచ్చారు. దీంతో చైనా సైనికులు వెనుతిరగక తప్పలేదని పేర్కొన్నారు. జిన్‌పింగ్ వచ్చిన తర్వాత పీఎల్ఏ చొరబాట్లు పెరిగాయని న్యూస్ కథనంలో ఉంది.

Tags :
|

Advertisement