22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను ...సౌరవ్ గంగూలీ
By: Sankar Tue, 24 Nov 2020 7:55 PM
గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మంగళవారం వెల్లడించారు. సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ తొలి వరకు యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
‘నేను గత నాలుగున్నర నెలల్లో 22సార్లు టెస్ట్ చేయించుకున్నాను.. ఒక్కసారి కూడా పాజిటివ్’గా రాలేదన్నారు. నా చుట్టూ పాజిటివ్ కేసులు ఉన్నాయని, తద్వారా నన్ను నేను పరీక్షించుకోవాల్సి వచ్చిందని అని గంగూలీ పేర్కొన్నారు. ఓ టెక్నాలజీ బ్రాండ్ నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘నేను వృద్ధ తల్లిదండ్రుల వద్ద ఉంటానని. నేను దుబాయికి వెళ్లి వచ్చాను. ప్రారంభంలో చాలా ఆందోళన చెందాను. నా కోసం మాత్రమే కాదు.. కమ్యూనిటీ, ప్రజలు మమ్మల్ని చూస్తున్నారని, దాన్ని మరొకరికి వ్యాప్తి చేయాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం తన క్వారంటైన్ పీరియడ్ను పూర్తి చేసిన అనంతరం జాతీయ జట్టు ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడారు..