‘ఉన్మాది పాలనలో.. ఊరికో ఉన్మాది’...
By: chandrasekar Sat, 24 Oct 2020 1:38 PM
తెలుగు దేశం పార్టీ
అధినేత, మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై
సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉన్మాది పాలనలో.. ఊరికో ఉన్మాది’ తయారవుతున్నాడని
చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో
చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ
ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని ఉన్మాద పాలనను
చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరిందని
వ్యాఖ్యానించారు. సర్వే రాళ్లపై కూడా జగన్
బొమ్మలు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, గ్రానైట్
సర్వే రాళ్లు వేయడం తుగ్లక్ చర్య అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో 27వ
స్థానానికి వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ముద్దాయిల
ఇష్టారాజ్యంగా మారిందని, కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే రాష్ట్రంలో
ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆంబోతుల
మాదిరిగా మారారని, వారు ఎలా బరితెగించారో ప్రజలే చూస్తున్నారని
చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.