కోడలిపై మామ అఘాయిత్యం.. కొడుకు నిలదీయడంతో కాల్చి చంపాడు...!
By: Anji Mon, 30 Nov 2020 07:06 AM
56 ఏళ్ల ఓ వ్యక్తి తన పెద్ద కోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ విషయం గురించి ప్రశ్నించినందుకు కన్నకొడుకునే కాల్చి చంపాడు. ఉత్తర్ ప్రదేశ్లోని మొరదాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యూపీలోని మొరాదాబాద్కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. అతడికి లైసెన్స్డ్ తుపాకీ ఉంది. అతడి పెద్ద కుమారుడికి ఏడాది కిందట ఓ అమ్మాయితో పెళ్లి జరిపించాడు.
ఆమె స్థానికంగా ఓ హాస్పిటల్లో సపోర్ట్ స్టాఫ్గా పనిచేస్తోంది. నవంబర్ 25న ఆమె భర్త, అత్త ఇతర కుటుంబసభ్యులు కలిసి మొరదాబాద్కు సమీపంలోని మరో పట్టణంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
ఇదే అదనుగా చూసిన మామ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన దారుణం గురించి తలచుకొని ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది.
శనివారం (నవంబర్ 28) భర్త, అత్తకు చెప్పుకొని బోరుమంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త తన తండ్రిని నిలదీశాడు. దీంతో వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో ఆ వ్యక్తి చిన్న కుమారుడు తన తండ్రికే వంతపాడాడు. దీంతో ఘర్షణ ముదిరింది. కోపంతో ఊగిపోయిన ఆ తండ్రి, తన లైసెన్స్డ్ తుపాకీతో పెద్ద కుమారుడిని కాల్చి చంపాడు. తన కళ్ల ముందే జరిగిన ఆ పరిణామానికి ఆ కోడలు హతాశులరాలైంది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ, ఆమె అత్త, ఆ ఇంటి పనిమనిషిని ప్రశ్నించి వివరాలను సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.