Advertisement

  • యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సూచనలు చేసిన సొంత పార్టీ నేత ఉమాభారతి

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సూచనలు చేసిన సొంత పార్టీ నేత ఉమాభారతి

By: chandrasekar Sat, 03 Oct 2020 3:52 PM

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సూచనలు చేసిన సొంత పార్టీ నేత ఉమాభారతి


ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న సంఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సొంత పార్టీ నేత ఉమాభారతి సూచనలు చేశారు. హాథ్రాస్‌ ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్నాయి. తాజాగా, సొంత పార్టీ నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ పోలీసుల తీరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బీజేపీకి కూడా మచ్చ తెచ్చెలా ఉందని దుయ్యబట్టారు. బాధిత యువతి కుటుంబాన్ని కలుసుకోడానికి రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలని యోగికి ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేశారు. ఓ దళిత కుటుంబానికి చెందిన కుమార్తె ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత పోలీసులు హడావుడిగా ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని, గ్రామాన్నీ ఎవరితో కలవనీయకుండా చేస్తున్నారు. హాథ్రాస్‌ ఘటనలో బాధ్యులపై మీరు తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించి ఈ విషయాల గురించి ఏమీ మాట్లాడొద్దని అనుకున్నా కానీ బాధితుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరం. సిట్‌ దర్యాప్తు జరుగుతున్నందున బాధితులు ఎవరితో కలవకూడదనే నిబంధన ఉందా? అని అడిగారు

హాథ్రాస్‌ ఘటన పై సిట్‌ దర్యాప్తు ఇలాంటి చర్యల వల్ల కూడా అనుమనాలు రేకెత్తుతాయి. రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మనం(బీజేపీ ప్రభుత్వం) దేశంలో రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాథ్రాస్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు అటు యూపీ ప్రభుత్వంతో పాటు బీజేపీకి కూడా మచ్చ తెస్తోంది అని వరుస ట్వీట్లలో ఉమాభారతి మండిపడ్డారు. ప్రస్తుతం తాను కరోనావైరస్‌కు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నాను, వైరస్ నిర్ధారణ అయి ఏడు రోజులయ్యింది. ఇప్పటి వరకు నేను ఎవరినీ కలవలేదని బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును కూడా వినలేదని ఫోన్‌లోనూ ఎవరితో మాట్లాడలేదు. టీవీలోనే న్యూస్ చూస్తున్నాను. లేదంటే ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించేదాన్ని. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత వారిని కలుస్తాను. ముఖ్యమంత్రిగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలి. బీజేపీలో నేను మీకంటే సీనియర్‌ని మీకు అక్కలాంటి దాన్ని నా అభ్యర్థలను, సూచనలను కొట్టిపారేయొద్దు అని సీఎం యోగిని కోరారు. సోషల్ మీడియాలో హాథ్రాస్‌ ఘటన చాల వైరల్ గా వ్యాపిస్తా వుంది.

Tags :

Advertisement