రామ మందిర్ భూమి పూజకు వెళ్లడం లేదు ..ఉమా భారతి
By: Sankar Mon, 03 Aug 2020 10:35 AM
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదని ఉమాభారతి తెలిపారు. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో భూమిపూజ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆమె ట్వీట్ చేశారు. వాస్తవానికి ఉమాభారతికి ఆహ్వానం ఉంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారి పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రామ మందిర ఉద్యమంతో అనుబంధం ఉన్న ఉమాభారతి.. భోపాల్ నుంచి రైలులో అయోధ్యకు వెళ్తున్నారు. అయితే ఆమె భూమిపూజ కార్యక్రమంలో నేరుగా పాల్గొనకుండా.. సరయూ నది తీరంలో వేచి ఉండనున్నట్లు చెప్పారు.
భూమి పూజ ముగిసిన తర్వాత ఆమె రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అద్వానీ, జోషీలు కూడా ఈ ఈవెంట్ను వర్చువల్గా వీక్షించనున్నారు. మోదీతో పాటు కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్లు ప్రత్యక్షంగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.