Advertisement

ప్రపంచంలోనే ధనిక బ్యాంకర్‌గా ఉదయ్ కొటక్...

By: chandrasekar Fri, 18 Dec 2020 9:03 PM

ప్రపంచంలోనే ధనిక బ్యాంకర్‌గా ఉదయ్ కొటక్...


బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 61 ఏళ్ల ఉదయ్ కొటక్ సంపద 16 బిలియన్ డాలర్లు. ఓవైపు కరోనా ఆర్థిక మాంద్యం భయపెడుతున్నా కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రం ఈ ఏడాది 17 శాతం పెరిగాయి. 20 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతుండగా బంతి బలంగా దూసుకొచ్చి తలకు తగలడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత అతడికి ప్రాణాపాయం తప్పింది గానీ ప్రొఫెషనల్ క్రికెట్ ను వదిలేసుకున్నాడు. పశ్చిమ గుజరాత్‌కు చెందిన ఉదయ్ కొటక్ 1985లో కుటుంబ సభ్యులు, స్నేహితుల దగ్గర 30 లక్షల రూపాయల తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేశారు. తర్వాత సంవత్సరం మహీంద్రాతో జతకట్టారు. బిల్ డిస్కౌంటింగ్‌తో మొదలుపెట్టి లోన్ పోర్ట్‌ఫోలియో తర్వాత స్టాక్ బ్రోకరింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్‌లోకి అడుగుపెట్టారు.

ఆ తరువాత కాటన్ ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టాడు. ముంబైలోని ప్రముఖ జమున్‌లాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ పూర్తి చేసి వ్యాపారంలో రాణిస్తూ ప్రపంచంలోనే ధనిక బ్యాంకర్‌గా ఎదిగాడు. బ్యాంకులకు రుణాల ఎగవేత అనేది ప్రధాన సమస్య. దాని ప్రభావం బ్యాంకుల పేరు ప్రతిష్టలు, పనితీరుపై పడుతుంది. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు, అసురక్షిత వ్యక్తులకు రుణాలు ఇవ్వడాన్ని కొటక్ తగ్గించింది. దీంతో గత మూడేళ్లలో కొటక్ బ్యాంకు షేర్లు 24 శాతం పెరిగాయి. 2020లో మొండి బకాయిల విషయంలో కొటక్ బ్యాంక్ రెండో అత్యుత్తమ బ్యాంకుగా నిలిచింది. 2003లో ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్స్ పొందింది.ఆ బ్యాంకు సీఈవోగా కోటక్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించారు.

Tags :
|
|

Advertisement