Advertisement

సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు...!

By: Anji Mon, 19 Oct 2020 09:45 AM

సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు...!

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో వాహనాలు, జనాలు సైతం కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం రట్టి సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.


ఆరుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారు కమలాపురానికి చెందిన జాయి శ్రీకాంత్ (18), సిరియాపల్లికి చెందిన సిసింద్రీ (18)గా స్థానికులు, అధికారులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది తీరంలో వెతుకుతున్నారు.

Tags :

Advertisement