Advertisement

  • సిమ్ బ్లాక్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి 2.7లక్షల రూపాయలు దోచిన సైబర్ నేరగాళ్ళు

సిమ్ బ్లాక్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి 2.7లక్షల రూపాయలు దోచిన సైబర్ నేరగాళ్ళు

By: Sankar Mon, 14 Dec 2020 9:29 PM

సిమ్ బ్లాక్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి  2.7లక్షల రూపాయలు దోచిన సైబర్ నేరగాళ్ళు


జియో కస్టమర్‌ సర్వీస్‌ పేరిట కొత్తరకం మోసానికి తెరతీశారు సైబర్‌ నేరగాళ్లు. జియో కస్టమర్లకు ఫోన్‌ చేసి ‘మీ సిమ​ బ్లాక్‌ అవుతుంది. వెంటనే రీఛార్జ్‌ చేయాలి’ అంటూ కస్టమర్‌ కేర్‌నుంచి ఫోన్‌ చేసినట్లుగా నమ్మిస్తున్నారు.

రిమోట్‌ యాక్సె్‌స్‌ యాప్‌ ద్వారా రిఛార్జ్‌ చేయాలని చెబుతున్నారు. ఆ యాప్‌ ద్వారా కస్టమర్ల అకౌంట్లలోంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఇద్దరు మహిళలనుంచి 2.7లక్షల రూపాయలు దోచేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జియో కస్టమర్లు సైబర్‌ చీటర్స్‌ నుండి అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ బ్యాంకులు, కస్టమర్‌ కేర్‌ పేరిట వచ్చే ఫోన్‌కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే చెప్పొద్దని, వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Tags :
|
|

Advertisement