ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
By: chandrasekar Thu, 15 Oct 2020 6:37 PM
బుధవారం ఉదయం
జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు
ఉగ్రవాదులు హతమయ్యారు. పక్కా సమాచారం మేరకు షాపియాన్ జిల్లాలోని చకురా ప్రాంతంలో
భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలను చూసిన
ఉగ్రవాదులు తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. దాంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు
జరిపాయి.
తుపాకీ కాల్పులు ముగిసిన
తర్వాత అక్కడ వెతగ్గా ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభించాయి. ఈ ప్రాంతంలో మరింత
శోధనలు జరుపుతున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో జమ్మూ
కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాల సంయుక్త బృందం పాల్గొన్నది. ఎన్కౌంటర్లో
హతమైన వారి మృతదేహాలను ఇంకా ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. పోలీసులు చనిపోయిన ఉగ్రవాదులు ఏ గ్రూపునకు చెందినవారో గుర్తించే
పనిలో ఉన్నారు.