కడపలో విషాదం ..తండ్రి చనిపోయిన బాధలో ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య
By: Sankar Mon, 10 Aug 2020 09:54 AM
ఆడపిల్లలకు తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ..చిన్నపాటి నుంచి ఏ కష్టం రాకుండా పెంచుతూ , పెద్దయ్యాక పెళ్లి చేసి వారి యొక్క ప్రతి సుఖ దుఃఖంలో తండ్రి ఎల్లపుడు తోడుగా ఉంటాడు ..అయితే అలాంటి తండ్రి చనిపోతే ఆ కూతుళ్ళ బాధ చెప్పడానికి వర్ణనాతీతం ..అయితే తండ్రి చనిపోయిన బాధలో కూతుళ్లు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది ..
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. కుటుంబ సమస్యలతో తండ్రి బాబురెడ్డి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కూతురు శ్వేతను భర్త వేధిస్తునాడు. ఆ బాధ తో తండ్రి బాబురెడ్డి తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనితో తీవ్ర వేదన గురి అయిన అక్కతో పాటు ఇంజనీరింగ్ చదువుతున్న చెల్లి సాయి ఆత్మహత్య చేసుకున్నది. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్పైన ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో ప్రొద్దుటూరులో విషాదఛాయలు అలముకున్నాయి.