Advertisement

  • ముంబైలో విషాదం: లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో...!

ముంబైలో విషాదం: లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో...!

By: Anji Thu, 24 Sept 2020 1:18 PM

ముంబైలో విషాదం: లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో...!

ఆర్థిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృత్యువాత పడ్డారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరాన్ని ముంచెత్తింది. ఇదే క్రమంలో కాలాపాణీ ప్రాంతంలోని బిల్డింగ్ లోకి వరద నీరు వచ్చింది. దీంతో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు బేస్‌మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ లిఫ్టులో వచ్చారు.

అయితే, లిప్టు తలుపులు తెరుచుకోలేదు. బేస్‌మెంట్‌లో నిండిన నీరంతా లిఫ్టులోనికి ప్రవేశించి అది నిండిపోయింది. ఫలితంగా లిఫ్టులోని నీటిలో మునిగి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. ముంబైలోని కాలాపాణీ జంక్షన్ సమీపంలోని నైథానీ రెసిడెన్సీ అపార్టుమెంట్ కొన్నేళ్ల క్రితం నిర్మించారు. జమీర్ సోహనన్(32), షహజాద్ మేనన్(37) ఈ బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వారు బిల్డింగ్‌కు నీటిని సప్లయ్ చేసేందుకు బేస్‌మెంట్ దగ్గరున్న పంప్ దగ్గర స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లారు.

అప్పటికే బేస్‌మెంట్‌ మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. దీంతో వారు లిప్టు నుంచి బయటకు రాకుండా, తలుపులు మూసివేశారు. తరువాత పైకి వెళ్లేందుకు లిఫ్టుకు కాల్ చేశారు. అయితే లిప్టు కదలలేదు. లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు లిఫ్టు అలారం మోగించారు. దానిని విన్న బిల్డింగ్‌లోని కొంతమంది ఆ లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

దీంతో ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, లిఫ్టు పైభాగాన్ని కట్ చేసి లోనికి వెళ్లేసరికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నీటిలో మునిగిపోయారు. ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరిశీలించి, అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement