Advertisement

  • బైక్ పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు ..ఇద్దరు మృతి

బైక్ పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు ..ఇద్దరు మృతి

By: Sankar Sun, 13 Sept 2020 10:56 AM

బైక్ పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు ..ఇద్దరు మృతి


ఢిల్లీలోని దయాళ్‌పూర్ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. కొందరు దుండగులు ముగ్గురు వ్యక్తులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతులను అబ్దుల్లా హమీద్, ఫారూక్ గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన జోజఫ్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఈ ఘటనను గ్యాంగ్‌వార్‌గా గుర్తించారు. దుండగులు బైక్‌పై వచ్చి పలు రౌండ్లు కాల్పులు జరిపి, పరారయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుండగులు మూంగా నగర్‌లో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. అలాగే అక్కడికి సమీపంలోని నెహ్రూ విహార్‌లో మరొక వ్యక్తిపై తూటాల వర్షం కురిపించారు.

పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలోని సీటీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement