Advertisement

  • ఏలూరు ఘటనలో ఇద్దరు మృతి ...ఆందోళన చెందుతున్న ఇతర రోగులు

ఏలూరు ఘటనలో ఇద్దరు మృతి ...ఆందోళన చెందుతున్న ఇతర రోగులు

By: Sankar Sun, 06 Dec 2020 9:48 PM

ఏలూరు ఘటనలో ఇద్దరు మృతి ...ఆందోళన చెందుతున్న ఇతర రోగులు

ఏలూరులో అంతుచిక్కని వ్యాధులు కలవరపెడుతున్నాయి... ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది... విద్యానగర్‌కు చెందిన 45 ఏళ్ల శ్రీధర్‌ మృతిచెందారు..

తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీధర్‌ ఆస్పత్రిలో చేరారు.. అయితే, చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు... దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక, సరైన వైద్యం అందకనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందాడని వైద్యులు చెబుతున్నారు.. మరోవైపు... దక్షిణ వీధికి చెందిన మరో వ్యక్తి కూడా మృతిచెందినట్టు చెబుతున్నారు.. ఇలా ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు... బాధితుల సంఖ్య ఇప్పటికే దాదాపు 300కు చేరింది. మరోవైపు... ఆ వ్యాధి నిర్ధారించే పనిలో పడ్డారు వైద్యులు.

Tags :
|
|
|
|

Advertisement