అబిడ్స్లో రోడ్డు ప్రమాదం లో ఇద్దరు వ్యక్తుల మృతి
By: chandrasekar Wed, 23 Sept 2020 5:05 PM
బుధవారం అడిబ్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర
వాహనదారులు మృత్యువు పాలయ్యారు. అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధి కృపా టిఫిన్
సెంటర్లో పని చేసే మాస్టర్ బైక్పై పని ముగించుకొని ఇంటికి తిరుగు బయలుదేరారు.
ఈ క్రమంలో రోడ్డు
దాటుతుండగా అటువైపుగా వేగంగా వచ్చిన వాహన౦ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో
వ్యక్తిని హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ప్రమాద
దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని
దర్యాప్తు చేస్తున్నారు.
Tags :
road |
accident |