Advertisement

  • కారు రూపంలో వచ్చిన ఊహించని ప్రమాదం ..ప్రేమ జంట దుర్మరణం

కారు రూపంలో వచ్చిన ఊహించని ప్రమాదం ..ప్రేమ జంట దుర్మరణం

By: Sankar Mon, 12 Oct 2020 9:54 PM

కారు రూపంలో వచ్చిన ఊహించని ప్రమాదం ..ప్రేమ జంట దుర్మరణం


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వస్తున్న కారు.. సిగ్నల్ వద్ద వేచి ఉన్న వాహనాల్ని వరుసగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రెండు బైకులు,రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.

ఈ ప్రమాదంలో ఓ ప్రేమ జంట మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఓ బైకు పూర్తిగా దగ్దమయ్యి౦ది. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో నాగరాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడెం చెందిన ప్రేమజంట వివాహం చేసుకునేందుకు కొండగట్టు వెళ్తున్నారు.. ఈ సమయంలో చౌటుప్పల్ ప్రాంతానికి రాగానే ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బ్రీజా కారు ఒక్కసారిగా అదుపుతప్పింది.. దీంతో రోడ్డు మీద వెళ్తున్న టూవీలర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పైన ఉన్న ప్రేమ జంట కు తీవ్ర గాయాలయ్యాయి.. యువతి అక్కడికక్కడే చనిపోగా, యువకుడు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.. వీళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకునేందుకు కొండగట్టు కి వెళ్తున్నారు. వీరితో పాటు వెనకాలే బాబాయ్ చిన్న అమ్మా ఉన్నారు.. వెనకాల ఉన్న వీరి వాహనాన్ని కూడా కారు ఢీకొనడంతో గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు

Tags :
|
|

Advertisement