ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ..ఇద్దరు మృతి
By: Sankar Wed, 16 Dec 2020 11:32 AM
ఖమ్మం జిల్లాలోని విజయవాడ-ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలంలో తుమ్మలపల్లి సమీపంలో కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందరు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ నుంచి ఒడిశా వెళ్తున్న కారు తుమ్మలపల్లి వద్ద ఇవాళ తెల్లవారుజామున బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతులను ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా వ్యాపారం నిమిత్తం విజయవాడ వైపు నుంచి ఒడిశాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.