సోమవారం రాత్రి ఢిల్లీలో జమ్మూకాశ్మీర్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
By: chandrasekar Tue, 17 Nov 2020 8:08 PM
గత కొంత కాలంగా
ఉగ్రవాదులు సంచారం పలుచోట్ల బయటపడుతున్నాయి. జమ్మూకాశ్మీర్కు చెందిన ఇద్దరు
అనుమానిత ఉగ్రవాదులను సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్
సెల్ తెలిపింది. అరెస్టు సమయంలో వారి నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్తో
పాటు పది లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఢిల్లీలో
ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోమవారం రాత్రి మిలీనియం పార్క్, సారాయ్
కాలే ఖాన్ సమీపంలో వారిని వలపన్ని పట్టుకున్నారు.
ప్రస్తుతం పట్టు బడ్డ
జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా, కుప్వారా నివాసితులైన అనుమానిత ఉగ్రవాదులను అబ్దుల్
లతీఫ్ (22), అష్రఫ్
ఖటన (20)గా
గుర్తించారు. ఇంతకు ముందు ఆగస్టులో దేశ రాజధానిలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్
ఐసిస్ ఆపరేటివ్ యూసుఫ్ ఖాన్ను పట్టుకుంది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య
కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు కుట్ర
చేస్తున్నట్లు తెలుస్తుంది.