ఒకే రోజు పరిటాల శ్రీరామ్కు రెండు శుభవార్తలు...
By: chandrasekar Fri, 06 Nov 2020 3:45 PM
టీడీపీ యువనేత, మాజీ
మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ ఒకే రోజు రెండు శుభవార్తలు విన్నారు. అందులో
మొదటిది శ్రీరామ్ సతీమణి జ్ఞాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శుభవార్త విన్న
కొద్ది గంటల్లోనే మరో తీపి కబురు పార్టీ నుంచి వచ్చింది. శ్రీరామ్కు రాష్ట్ర
కమిటీలో చోటు దక్కింది. ఆయన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా
నియమించారు.
అటు తండ్రిగా, ఇటు
పార్టీలో శ్రీరామ్కు డబుల్ ప్రమోషన్ దక్కిందని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో
శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పరిటాల శ్రీరామ్ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నా 2019
ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తల్లి పరిటాల సునీత బదులు అనంతపురం జిల్లా
రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి
ప్రకాష్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాప్తాడు నియోజకవర్గ బాధ్యతలు
చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో ధర్మవరం మాజీ
ఎమ్మెల్యే సూరి బీజేపీలో చేరడంతో చంద్రబాబు ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా పరిటాల
కుటుంబానికి అప్పగించారు. దీంతో రెండు నియోజకవర్గాల బాధ్యతల్ని శ్రీరామ్
చూసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి దక్కింది.