Advertisement

  • కశ్మీర్ మిలిటెంట్ల జరిపిన ఫైరింగ్ లో ఇద్దరు సీఆరీపీఎఫ్ జవాన్ల మరణం

కశ్మీర్ మిలిటెంట్ల జరిపిన ఫైరింగ్ లో ఇద్దరు సీఆరీపీఎఫ్ జవాన్ల మరణం

By: chandrasekar Mon, 17 Aug 2020 11:13 PM

కశ్మీర్ మిలిటెంట్ల జరిపిన ఫైరింగ్ లో ఇద్దరు సీఆరీపీఎఫ్ జవాన్ల మరణం


కశ్మీర్ లోని సీఆర్ పీఎఫ్ జాయింట్ పెట్రోలింగ్ పార్టీపై మిలిటెంట్లు ఆటోమెటిక్ తుపాకులతో దాడి చేశారు. బారాముల్లా జిల్లాలో ఇవాళ జరిగిన మిలిటెంట్లు దాడిలో ఇద్దరు సీఆర్ పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.

మిలిటెంట్ల జరిపిన ఫైరింగ్ లో ఇద్దరు సీఆరీపీఎఫ్ జవాన్లు, ఓ పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. వారందర్నీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడే ఆ ముగ్గురూ ప్రాణాలు విడిచారు. కాల్పుల్లో మృతిచెందిన పోలీసును ఎస్పీవో ముజాఫర్ అహ్మద్ గా గుర్తించారు.

దాడి తర్వాత మిలిటెంట్లు పారిపోయారు. ముగ్గురికి చెందిన ఆయుధాలను మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే రక్షణ బలగాలు వెళ్లాయి. అక్కడ మిలిటెంట్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఆగస్టు 14వ తేదీన ఎస్ఎస్బీ పెట్రోలింగ్ పార్టీపై మిలిటెంట్లు దాడి చేశారు. గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలపై దాడి జరగడం ఇది రెండవ సారి.

Tags :
|
|
|

Advertisement