Advertisement

  • కర్నూల్ లో చిన్నారుల కిడ్నాప్...పోలీసులు అప్రమత్తతో వదిలివెళ్లిన దుండగులు

కర్నూల్ లో చిన్నారుల కిడ్నాప్...పోలీసులు అప్రమత్తతో వదిలివెళ్లిన దుండగులు

By: Sankar Mon, 23 Nov 2020 06:31 AM

కర్నూల్ లో చిన్నారుల కిడ్నాప్...పోలీసులు అప్రమత్తతో వదిలివెళ్లిన దుండగులు


కర్నూలు వన్ టౌన్ పీఎస్ పరిధిలో ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ కు ప్రయత్నించి పోలీసులు సకాలంలో అప్రమత్తం కావడంతో చిన్నారులను వదిలి వెళ్లినట్టు గుర్తించారు.

కర్నూలు ఓల్డ్ సిటీ కి చెందిన మోక్షిత (6), రోహిత (5) ఇంటి ముందు ఆడుకుంటూ 5.30 తర్వాత కన్పించలేదు. ఆందోళనలో తల్లిదండ్రులు వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమై సిటీ అంతా పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ తనిఖీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారులను తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వెంటనే చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే కొండారెడ్డి బురుజు వద్ద ఆ చిన్నారులను గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాక్లెట్ ఇప్పిస్తానని చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తి వెంట తీసుకు వెళ్లినట్లు చిన్నారులు చెబుతున్నారు. చిన్నారులు దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :
|

Advertisement