Advertisement

  • హైదరాబాద్ లో విషాదం ..రెండు వేరువేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్ లో విషాదం ..రెండు వేరువేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు మృతి

By: Sankar Wed, 30 Sept 2020 6:08 PM

హైదరాబాద్ లో విషాదం ..రెండు వేరువేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు మృతి


హైద్రాబాద్లో ఈ రోజు జరిగిన రెండు వేరు వేరు ప్రమాదాలలో ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులు బలయ్యారు..ఒకరు పోలీస్ వాహనం కింద పడగా, మరొక చిన్నారిని వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది..ఈ రెండు సంఘటనలలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు..

మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే 7 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆ బాలుడిని గుద్దింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని డ్రైవర్ భగవాన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని సీఐ రాంవీర్ రెడ్డి ఆ బాలుడి తెలిపారు. ఆ బాలుడి మృతి గురించి విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని పరామర్శించారు.

మరోవైపు, పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 3 సంవత్సరాల మారుయం అనే చిన్నారి ఇంట్లో నుండి బయటికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో టిప్పర్ అత్యంత వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆ బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :
|

Advertisement