Advertisement

రెండు బెడ్‌రూం ఇండ్లు...సిద్దిపేట‌లో మరో 1,000

By: chandrasekar Wed, 09 Dec 2020 3:13 PM

రెండు బెడ్‌రూం ఇండ్లు...సిద్దిపేట‌లో మరో 1,000


న‌ర్సాపూర్ రెండు బెడ్‌రూం హౌజింగ్ కాల‌నీలో ఎంపికైనా 144 మంది ల‌బ్దిదారుల‌కు మంత్రి హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం స‌ర్టిఫికెట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన‌ స‌భ‌లో మాట్లాడారు.

మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటికే నిర్మించిన 2,460 ఇళ్లతో పాటు సిద్దిపేట కోసం మరో 1,000 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ల‌బ్దిదారుల‌కు కొత్త వస్త్రాల‌ను బ‌హూక‌రించారు. వీరు డిసెంబ‌ర్ 10న గృహ‌ప్ర‌వేశాలు చేయ‌నున్నారు.

ల‌బ్దిదారులుగా మొత్తం 1,341 మంది ఎంపిక‌య్యార‌న్నారు. మిగితా వారికి ద‌శ‌ల వారీగా గృహాల‌ను అంద‌జేస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం మొత్తం 2,460 ఇండ్ల‌ను నిర్మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తైన వెంట‌నే అద‌నంగా మ‌రో వెయ్యి రెండు బెడ్‌రూం ఇండ్ల‌ను నిర్మిస్తామ‌న్నారు. త‌న చేతుల మీదుగా ప్రజలకు పట్టాలు అంద‌జేయ‌డం నిజంగా ఆశీర్వాద‌మేనని అన్నారు మంత్రి .

Tags :
|
|
|

Advertisement