Advertisement

  • వివాహేతర సంబంధం ..పిల్లలను చెరువులోకి తోసేసి ప్రియుడితో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత

వివాహేతర సంబంధం ..పిల్లలను చెరువులోకి తోసేసి ప్రియుడితో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత

By: Sankar Tue, 15 Sept 2020 3:22 PM

వివాహేతర సంబంధం ..పిల్లలను చెరువులోకి తోసేసి ప్రియుడితో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత


వివాహేతర సంబంధం ఇద్దరు పిల్లల నిండు ప్రాణాలను బలి తీసుకుంది..ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. తన ఇద్దరి బిడ్డలను చేరులో తోసేసింది. అనంతరం ప్రియుడితో కలిసి ఆమె ఆత్మహత్యయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిచర్ల మండలం రామిరెడ్డిగారి పల్లెకు చెందిన వెంకటేశ్వ రెడ్డికి అదేగ్రామానికి చెందిన హేమశ్రీతో 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కవలు కాగా.. ఏడాది కూడా కాలేదు.

ఇదిలా ఉండగా.. హేమశ్రీకి ఉదయకుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీయడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హేమశ్రీ తన ఇద్దరు పిల్లలు, ప్రియుడు ఉదయకుమార్‌తో కలసి ఆటోలో సదుం మండలం నడిమోడీ గుంట చెరువు దగ్గరకు వెళ్లారు. ముందుగా ఇద్దరు చిన్నారులను చెరువులో తోసేసి హేమశ్రీ అనంతరం ప్రియుడుతో కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని గమనించిన స్థానికులు పోలీసులు, 108కు సమాచారం అందించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న హేమశ్రీ ఆమె ప్రియుడు ఉదయ్ కుమార్‌ను పీలేరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెరువులోని మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు

Tags :
|
|

Advertisement