Advertisement

నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు ...

By: Sankar Fri, 20 Nov 2020 08:38 AM

నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు ...


తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పవిత్రమైన పుష్కరాలు ఇవాళ మధ్యాహ్నం 1:21 గంటలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.

గతంలో 2008 లో తుంగభద్ర పుష్కరాలు సాగగా... ఈ ఏడాది 20 నుంచి డిసెంబర్‌ 1 వరకూ అంటే 12 రోజులు ఈ పుష్కరాలు జరగనున్నాయి. తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లాలోని సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద ఇవాళ శాస్త్రోకంగా జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

ఇక పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా నదీ స్నానాలకు బదులుగా జల్లు స్నానాలు చేయాలని భక్తులకు సూచించింది ప్రభుత్వం.

Tags :
|
|

Advertisement