టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు, వైసీపీ రాజ్యసభ ఎంపీ కి టీటీడీ షాక్
By: chandrasekar Mon, 16 Nov 2020 8:50 PM
పరువు నష్టం కేసుపై
టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు, వైసీపీ రాజ్యసభ ఎంపీ కి టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమల
ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ
ఎట్టలకేలకు షాకిచ్చింది. వీరిద్దరిపై వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకోవడం
లేదని టీటీడీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై
పరువు నష్టం కేసును వెనక్కి తీసుకునేలా టీటీడీ ప్రయత్నిస్తోందంటూ పత్రికల్లో వరుస
కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు టీటీడీ వెనక్కి తగ్గింది. వారిపై ఉన్న పరువు
నష్టం కేసును కొనసాగిస్తామని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి వద్ద టీటీడీ సోమవారం
పిటిషన్ దాఖలు చేసింది.
వీరిపై ఇంతకుమునుపు 2018లో
వేసిన పరువు నష్టం కేసును కొనసాగిస్తామని తెలిపింది. 2020లో దాఖలు
చేసిన పరువు నష్టం కేసును వెనక్కు తీసుకునే పిటీషన్ను రద్దు చేసుకుంటున్నట్లు
కోర్టుకు టీటీడీ తెలియజేసింది. దీనివల్ల వీరి ఇరువురుకు షాకిచ్చినట్లయింది.