Advertisement

  • శ్రీ‌వారి ఆన్‌లైన్‌ క‌ల్యాణోత్సవ టికెట్లఅక్టోబర్‌ నెల కోటాను విడుదల చేసిన టీటీడీ

శ్రీ‌వారి ఆన్‌లైన్‌ క‌ల్యాణోత్సవ టికెట్లఅక్టోబర్‌ నెల కోటాను విడుదల చేసిన టీటీడీ

By: chandrasekar Fri, 25 Sept 2020 12:03 PM

శ్రీ‌వారి ఆన్‌లైన్‌ క‌ల్యాణోత్సవ టికెట్లఅక్టోబర్‌ నెల కోటాను విడుదల చేసిన టీటీడీ


అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీ‌వారి ఆన్‌లైన్‌ క‌ల్యాణోత్సవ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ తేదీల్లో కల్యాణోత్సవం లేదు. ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు (ఇద్దరు) టికెట్‌ బుక్‌ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.

ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభమవుతుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లు కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ అధికారులు చెప్పారు. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టు ద్వారా భక్తులకు పంపిస్తారు. లాక్‌డౌన్, కరోనా ప్రభావంతో కళ్యాణోత్సంకు భక్తులు దూరమయ్యారు. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా కళ్యాణోత్సం నిర్వహించేందుకు సిద్ధమైంది.

టికెట్లు బుక్ చేసే విధానం:

* ఫస్ట్ www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ చేయాలి.

* ఆన్‌లైన్‌లో క‌ల్యాణోత్స‌వం (ఆన్‌లైన్ పార్టిసిపేషన్) అనే బటన్ ని క్లిక్ చేయాలి.

* ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్‌ లో టిక్ గుర్తు పెట్టాలి.

* ఆ తర్వాత క‌ల్యాణోత్స‌వం తేదీని, గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపిణీ కోసం చిరునామా వివరాలు పొందుపరచాలి.

* ఈ సమాచారాన్ని సరిచూసుకొని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది.

* ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్‌ ద్వారా సదరు టికెట్ మొత్తాన్ని కట్టవచ్చు.

* పేమెంట్ పూర్తయిన తరువాత టికెట్ ఖరారవుతుంది.

Tags :

Advertisement