తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధికి ఇ-హుండీ సౌకర్యం కల్పించిన టీటీడీ
By: chandrasekar Sat, 01 Aug 2020 3:36 PM
ప్రజల సౌకర్యార్థం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఇ-హుండీ సౌకర్యాన్ని టీటీడీ
అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా దర్శనానికి రాలేని భక్తులు ఇ-హుండీ ద్వారా ఆన్లైన్లో అమ్మవారికి కానుకలు
సమర్పించవచ్చని సూచించింది.
శ్రీ పద్మావతి అమ్మవారి
ఆలయానికి కానుకలు సమర్పించుటకు www.tirupatibalaji.ap.gov.in
వెబ్సైట్ ద్వారాగానీ, గోవింద మొబైల్ యాప్
ద్వారా గానీ భక్తులు కానుకలు చెల్లించవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. టీటీడీ
తీసికొచ్చిన ఈ సౌకర్యాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని తెలియజేసారు.
వెబ్సైట్, యాప్లో
ఇదివరకే నమోదు చేసుకున్న భక్తులతో పాటు ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు కూడా ఈ
సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పేరు, ఇ-మెయిల్, మొబైల్
నంబరు,చిరునామా
తదితర వివరాలు పొందుపరిచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో కానుకలను సమర్పించవచ్చని
సూచించింది.