నూతన ఏడాది క్యాలెండర్ ముద్రణకు టిటిడి పాలకమండలి ఆమోదం
By: chandrasekar Thu, 17 Sept 2020 6:39 PM
టిటిడి 2021 నూతన
ఏడాదికి 15 లక్షల
శ్రీవారి క్యాలండర్లు, 10 లక్షల డైరీలను ముద్రించి విక్రయించనుంది. క్యాలెండర్ డైరీల ధరలను పెంచాలని పర్చేస్ కమిటీ
పాలకమండలికి సూచనలు చేసింది. స్వామి వారి
క్యాలెండర్ల ధరల పెంపుకు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుముకత వ్యక్తం
చేయలేదు. నూతన ఏడాదికి క్యాలెండర్, డైరీల రూపంలో భక్తులు స్వామి వారిని తమ గృహాలకు
తీసుకెళ్తరాని అలాంటి వాటిపై ధరలు పెంచకూడదని, గతంలో వున్న ధరలు మేరకే విక్రయాలు జరపాలని చైర్మన్
వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.
దీంతో అధికారులు ధరల
పెంపు నిర్ణయంను వెనక్కు తీసుకున్నారు. పాత ధరల ప్రకారం 12
పేజీలతో కూడిన పెద్ద క్యాలెండర్ రూ.100కు, పెద్ద డైరీ 130 రూపాయలకు టిటిడి అమ్మనుంది. ఇక చిన్న డైరీలను రూ.100కు, అమ్మవారి
నమూనా చిత్రంతో తాయారు చేసిన క్యాలెండర్ రూ.15,
స్వామి అమ్మవార్లు ఉన్న క్యాలెండర్ రూ15, శ్రీవారి
నమూన చిత్రం ఉన్న పెద్ద క్యాలెండర్ రూ.15,
తెలుగు పంచాంగం కలిగిన క్యాలెండర్ ను రూ.20, టేబుల్
క్యాలెండర్ లను 60 రూపాయలకు టిటిడి విక్రయించబోతోంది.