Advertisement

  • సచివాలయం కూల్చివేతపై మళ్ళీ స్టే విధించిన హైకోర్టు

సచివాలయం కూల్చివేతపై మళ్ళీ స్టే విధించిన హైకోర్టు

By: Sankar Mon, 13 July 2020 5:34 PM

సచివాలయం కూల్చివేతపై మళ్ళీ స్టే విధించిన హైకోర్టు



తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు జులై 15 వరకు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం భవనాల కూల్చివేతను నిలిపేయాలని పి.ఎల్. విశ్వేశ్వరరావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేటి వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి విచారణ సందర్భంగా.. సచివాలయ భవనాల కూల్చివేత పనులపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి ఏజీ స్పందిస్తూ.. ఈ రోజు సాయంత్రమే సమర్పిస్తామన్నారు. దీంతో బుధవారం వరకు సచివాలయ కూల్చివేతపై హై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో సచివాలయ భవనాల కూల్చివేత మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే భవనాల కూల్చివేత సగం పూర్తయ్యింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇదే విషయమై సుప్రీం కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇలా సచివాలయం కూల్చివేత కరెక్ట్ కాదు అని ప్రతి పక్షాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే ..అయితే ఇప్పటికే సగం సచివాలయం కూల్చివేసిన ప్రభుత్వం తదుపరి హైకోర్టు ఆదేశాలవరకు ఆపింది ..

Tags :
|
|
|

Advertisement