Advertisement

  • టపాసులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ...

టపాసులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ...

By: Sankar Fri, 13 Nov 2020 11:49 AM

టపాసులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ...


ప‌టాకుల‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించాల‌న్న హైకోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం తాజాగా ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప‌టాకుల దుకాణాలు త‌క్ష‌ణ‌మే మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, సీపీల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది..సామాజిక కోణంలో భాగంగా పండుగలు చాలా ముఖ్యమైనవని, కానీ ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమైనవని హైకోర్టు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. పటాకులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది..

పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ కొవిడ్‌ -19 వైరస్‌ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. పటాకులు కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ వ్యాధులున్న రోగులు, కొవిడ్‌ బాధితులు ఇబ్బందులు పడుతారని ధర్మాసనానికి నివేదించారు.వాదనలు నమోదుచేసుకొన్న ధర్మాసనం.. ప్రస్తుతం కొవిడ్‌ 19 మహమ్మారితో దేశం, రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుచేసింది. పలు దేశాల్లో ఇప్పటికే సెకండ్‌వేవ్‌ ప్రారంభమైందని సంకేతాలు అందుతున్నాయని వ్యాఖ్యానించింది. పటాకుల వల్ల గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుందని, కరోనా వైరస్‌ శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రంగా దాడి చేస్తుందని పేర్కొన్నది.ఈ రెండు వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది

Tags :
|

Advertisement