Advertisement

  • జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించనున్న ట్రంప్‌

జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించనున్న ట్రంప్‌

By: chandrasekar Mon, 01 June 2020 12:39 PM

జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించనున్న ట్రంప్‌


ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సమూహానికి భారత్‌, మరికొన్ని దేశాలను చేర్చాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూన్‌లో వైట్‌ హౌస్‌లో నిర్వహించనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని శనివారం వాయిదా వేశారు. అంతే కాకుండా జీ7 ను కాలం చెల్లిన గ్రూప్‌గా పేర్కొన్నారు.

ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ డిసికి తనతో పాటు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో ప్రయాణిస్తున్న విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ, సెప్టెంబర్‌ వరకు దానిని వాయిదా వేస్తున్నానని, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారతదేశాలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. జీ7 వల్ల ప్రపంచంలో ఏమి ఉపయోగం ఉందని నేను భావించడం లేదు. ఇది కాలం చెల్లిన సమూహం అని ఆయన అన్నారు.

చైనాను భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలో మాట్లాడటానికి ఈ గ్రూప్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందని దేశ సాంప్రదాయ మిత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని వైట్‌ హౌస్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ అలిస్సా అలెగ్జాండ్రా ఫరా అన్నారు.

trump,to invite,india,summit,people , శిఖరాగ్ర, సమావేశానికి, భారత్‌ను, ఆహ్వానించనున్న, ట్రంప్‌


కరోనావైరస్‌ వ్యాప్తి గతి మారితే తప్ప శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాదని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కార్యాలయం శనివారం తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడాలు గల ఏడు దేశాల ఫోరమ్‌ G7. ఈ దేశాల అధిపతులు అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సమస్యలపై ఏటా సమావేశమవుతారు.

ఈ సంవత్సరం జి 7 అధ్యక్ష భాద్యతను అమెరికా నిర్వహించనుంది. శిఖరాగ్ర సమావేశంలో జీ 7 అధ్యక్షుడు సాధారణంగా ఒకటి లేదా రెండు దేశాల దేశాధినేతలను ప్రత్యేక ఆహ్వానికంగా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానిస్తారు. గత ఏడాది ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. తదుపరి జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించడం గురించి ట్రంప్‌ మాట్లాడటం దేశం పట్ల అంతర్జాతీయంగా పెరుగుతున్న స్థాయిని ప్రతిబింబిస్తుంది.



Tags :
|
|
|

Advertisement