అధ్యక్ష ఎన్నికల్లో అదే మంత్రాన్ని జపిస్తున్న ట్రంప్
By: chandrasekar Thu, 16 July 2020 5:37 PM
అమెరికా అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో లోకల్
కార్డుతో అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. ఈ సారి కూడా ఇదే
మంత్రాన్ని జపిస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా అత్యంత
బలమైన మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ విధానాన్ని తీసుకు రానున్నానని ఇప్పటికే ట్రంప్
ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఉత్తర్వులపై సంతకం
చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ చట్టం అమలులోకి వస్తే, చిన్న
వయసులోనే భారత్, దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారికి మేలు
జరుగుతుందని, ప్రయోజనాలు కాపాడబడతాయని ఆయన అన్నారు. ‘అత్యంత
ముఖ్యమైన ఓ చట్టంపై అతి త్వరలోనే సంతకం చేయబోతున్నా. ఈ చట్టం చాలా బలంగా ఉంటుంది.
మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ దిశగా దేశం సాగనుంది. కుటుంబ బంధాలతో వీసాలు పొందే
అవకాశాలు తగ్గుతాయి’ అని వైట్హౌస్ రోజ్ గార్డెన్లో జరిగిన మీడియా సమావేశంలో
ట్రంప్ వ్యాఖ్యానించారు.
త్వరలోనే డిఫర్డ్ యాక్షన్
ఫర్ చైల్డ్ ఎరైవల్స్ (డీఏసీఏ) తేనున్నామని, ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని
స్పష్టం చేశారు. డీఏసీఏ ఎలా పని చేస్తుందో చూడాలని కన్జర్వేటివ్ రిపబ్లికన్లు కూడా
ఆసక్తితో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు.
డెమోక్రాట్లకు డీఏసీఏ
విషయంలో ఏదైనా చేయడానికి మూడేళ్ల అవకాశం ఉందని, అయితే, దానిని ఎప్పుడూ వాళ్లు పట్టించుకోలేదన్నారు. ‘ఎప్పుడూ
తిరస్కరించారు. దానిని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. నేను ఏదో చేయడానికి దాన్ని
ఉపయోగిస్తాను కాని చాలా శక్తివంతమైన ఇమ్మిగ్రేషన్ చట్టంపై సంతకం చేస్తాం. ఇది
గొప్పగా, మెరిట్
ఆధారితంగా ఉంటుంది. గత 25, 30 ఏళ్లుగా దీని కోసం ప్రయత్నిం జరుగుతోందని అన్నారు.
డీఏసీఏ విధానం అమలులోకి
వస్తే, తమ
తల్లిదండ్రుల వెంట డాక్యుమెంట్లు లేకుండా బాల్యంలోనే అమెరికాలోకి ప్రవేశించిన వారి
హక్కులు కాపాడబడతాయి. దాదాపు 7 లక్షల మంది యువతకు లబ్ది చేకూరుతుంది. వారికి వర్క్
పర్మిట్లు అందజేయబడతాయని ట్రంప్ సర్కారు చెబుతోంది. ఒబామా హయాంలో ప్రారంభించిన
ప్రోగ్రామ్లను ట్రంప్ రద్దుచేయాలని నిర్ణయించినా సుప్రీంకోర్టు దానికి అడ్డుకట్ట
వేసింది.