ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్స్ కరోనా
By: chandrasekar Fri, 02 Oct 2020 12:27 PM
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో
భాగంగా మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్తో కలిసి హూప్
హిక్స్ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. ట్రంప్ చర్చ సందర్భంగా పలువురు
అమెరికా సీనియర్ అధికారులతో కలిసి క్లీవ్లాండ్కు వెళ్లారు. తన సలహాదారిణికే
కరోనా సోకడంతో అమెరికన్ ప్రజల ఆరోగ్యం, భద్రతకు అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యమిస్తారని వైట్హౌస్
ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా కట్టడికి విధించిన నిబంధనలను పాటిస్తున్నారని
తెలిపింది. గతంలో ప్రైవేటు రంగంలో పనిచేసిన హూప్ ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతసౌధానికి
వచ్చారు. గతంలో వైట్హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టరుగా, 2016 అధ్యక్ష ఎన్నికల్లో
ట్రంప్ ప్రచార ప్రతినిధిగా పనిచేశారు. ట్రంప్తో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి వైరస్
నిర్ధారణ కావడంతో ట్రంప్ కరోనా పరీక్ష చేయించుకున్నారా అని ఇంకా తెలియలేదు. అయితే, ట్రంప్
గతంలోనూ రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. రెండుసార్లూ ఆయనకు
నెగెటివ్ వచ్చింది.
మార్చిలో బ్రెజిల్
అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోతో ట్రంప్ భేటీ అయ్యారు.
అయితే, ఈ భేటీ
జరిగిన రెండు రోజుల తర్వాత ఫాబియోకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో
డొనాల్డ్ ట్రంప్నకు కూడా కరోనా సోకిందేమోనని అనుమాన౦తో అమెరికా అధ్యక్షుడికి కరోనా పరీక్షలు
నిర్వహించారు. అప్పుడు కూడా నెగెటివ్గా వచ్చింది. ఏప్రిల్లో రెండోసారి
పరీక్షలోనూ ట్రంప్నకు నెగెటివ్ వచ్చినట్టు వ్యక్తిగత వైద్యుడు సీన్ పి కాన్లీ
తెలిపారు. కేవలం 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అధ్యక్షుడికి
కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సైతం ఈ విషయం
స్వయంగా ప్రకటించారు.