Advertisement

  • ఈ ఓటమిని ఒక హెచ్చరికలాగా భావిస్తాము ... దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

ఈ ఓటమిని ఒక హెచ్చరికలాగా భావిస్తాము ... దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

By: Sankar Tue, 10 Nov 2020 4:58 PM

ఈ ఓటమిని ఒక హెచ్చరికలాగా భావిస్తాము ... దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు


విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో విజయాలను నమోదు చేశామన్నారు. తాము ఏ ఎన్నికల్లో గెలిచినప్పుడైనా పార్టీ అధ్యక్షుడు, నాయకులు గానీ.. పొంగిపోలేదన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన 62వేల మంది పైచీలుకు ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు పని చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలిపారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం తాము ఆశించినట్లు రాలేదని చెప్పారు. రాజకీయాల్లో సహజంగా పోటీ చేసిన వారంతా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తారని, విజయం సాధించాలని, ప్రజల మెప్పు పొందాలని పని చేస్తామన్నారు. ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఎన్నో విజయాలను నమోదు చేశామని, ఈ సారి మాత్రం ఆశించిన ఫలితం రాలేదన్నారు.

ఈ ఎన్నిక పార్టీని, తమను అప్రమత్తం చేసిందని, మా నాయకులకు ఒక హెచ్చరికలా ఈ ఓటమిని భావిస్తామన్నారు. మేం అప్రమత్తం కావడానికి ఈ ఎన్నిక తోడ్పడుతుందని, ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామన్నారు. పరాజయానికి కుంగిపోకుండా సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతాని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement