నేరెడ్మెట్లో గెలుపొందిన టీఆర్ఎస్...
By: chandrasekar Wed, 09 Dec 2020 5:52 PM
GHMC ఎన్నికల ఫలితాల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ 136వ
డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్
రెడ్డి గెలుపొందారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు
చేరింది. హైకోర్టు నేరెడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్
ఓట్ల లెక్కింపును ప్రారంభించారు అధికారులు.ఓట్ల లెక్కింపు సైనిక్పురిలోని
భవన్స్ వివేకానంద కాలేజీలో జరిగింది.
నేరెడ్మెట్ డివిజన్ మొత్తంలో 25,176 ఓట్లు పోలవ్వగా 24,632 ఓట్లు లెక్కించారు.
డిసెంబర్ 4న
లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో
ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 ఓట్లను బుధవారం ఉదయం లెక్కించారు. అనంతరం ఎన్నికల
అధికారులు టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించారు.
స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘం జారీ
చేసిన సర్క్యులర్పై హైకోర్టులోరాష్ట్ర బీజేపీ లీగల్సెల్ ఇన్చార్జి పిటిషన్
దాఖలు చేయగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
ఏకీభవించడంతో స్వస్తిక్ మార్క్ కాకుండా ఇతర మార్కులను ఉపయోగించి బ్యాలెట్ పేపర్పై
ఓటు వేసినప్పుడు ఎన్నికల నియమాలు, తుది నిర్ణయం తీసుకునే అధికారం 2005 రూల్
51
ప్రకారం రిటర్నింగ్ అధికారికి ఉందని ఎస్ఈసీ తెలుపగా సమర్థించిన కోర్టు
వివాదాస్పద ఓట్లను లెక్కించాలని ఆదేశ౦ ఇచ్చింది.